ప్రసార భారతి మాజీ CEO ను రాజ్యసభకు నామినేట్ చేసిన తృణమూల్
ABN, First Publish Date - 2021-07-24T21:06:31+05:30
మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కర్ను తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు
కోల్కతా : మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కర్ను తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘జవహర్ సిక్కర్ను రాజ్యసభకు నామినేట్ చేయడం మాకు ఆనందంగా ఉంది. 42 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రసార భారతి సీఈవోగా కూడా పనిచేశారు. ఆయన ప్రజలకు చేసిన సేవ దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది’’ అని తృణమూల్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
Updated Date - 2021-07-24T21:06:31+05:30 IST