ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారద టేపుల కేసులో టీఎంసీ నేతల

ABN, First Publish Date - 2021-05-10T13:34:59+05:30

నారద టేపుల వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అగ్ర నేతలు ఫిర్హద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్‌ మిత్రా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విచారణకు గవర్నర్‌ అనుమతి

కోల్‌కతా, మే 9: నారద టేపుల వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అగ్ర నేతలు ఫిర్హద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్‌ మిత్రా, సోవన్‌ చటర్జీల విచారణకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ అనుమతి ఇచ్చారు. సీబీఐ చేసిన విజ్ఞప్తి  మేరకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. 2014లో నారద వార్తా సంస్థకు చెందిన మాథ్యూ శామ్యూల్‌ అనే వ్యక్తి ఈ టేపులను రహస్యంగా చిత్రీకరించగా.. 2016లో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఓ బూటకపు కంపెనీ ప్రతినిధుల నుంచి టీఎంసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు ఈ టేపుల్లో కనిపించాయి. ఫిర్హద్‌ హకీం, సుబ్రతా, మదన్‌, సోవన్‌లు కూడా వారిలో ఉన్నారు. 2014లో ఈ టేపులను చిత్రీకరించినపుడు ఈ నలుగురూ మమత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆ నలుగురి విచారణకు అనుమతి ఇవ్వాలని ఆదివారం సీబీఐ అధికారులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారని, అందుకు గవర్నర్‌.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163, 164 ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను వాడుకొని సీబీఐ విచారణకు అనుమతించారని రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో కలకత్తా హైకోర్టు 2017లో విచారణకు ఆదేశించింది.

Updated Date - 2021-05-10T13:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising