ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో మమతా పార్టీ కీలక ముందడుగు

ABN, First Publish Date - 2021-12-07T00:18:16+05:30

సోమవారం గోవా టీఎంసీ ఇంచార్జి మహువా మోయిత్రా ఆధ్వర్యంలో ఎంజీపీ అధినేత దీపక్ దివలికర్‌తో టీఎంసీ నేతలు ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఎంజీబీకి 12 స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజి: గోవాలో కాంగ్రెస్, గోవా ఫార్వాడ్ పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలవాలని అనుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేందుకు మమతా బెనర్జీ పార్టీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.


సోమవారం గోవా టీఎంసీ ఇంచార్జి మహువా మోయిత్రా ఆధ్వర్యంలో ఎంజీపీ అధినేత దీపక్ దివలికర్‌తో టీఎంసీ నేతలు ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఎంజీబీకి 12 స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వాస్తవానికి ఎంజీబీ ఇంతకు ముందు కాంగ్రెస్, ఆప్ పార్టీలతో సంప్రదింపులు జరిగింది. అయితే వారితో సయోధ్య కుదరకపోవడంతో టీఎంసీ చర్చలు చేసింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలం కావడంతో సీట్ల సర్దుబాటు కూడా పూర్తైంది. ఇదే ఉత్సాహంతో బెంగాల్ బయట విజయం సాధించి దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని టీఎంసీ ఉబలాటంలో ఉంది.

Updated Date - 2021-12-07T00:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising