ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : మందుపాతర పేలి ముగ్గురు సైనికుల మృతి

ABN, First Publish Date - 2021-08-27T13:49:07+05:30

పాకిస్థాన్ దేశంలో జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలోచిస్థాన్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. బలోచిస్థాన్ ప్రావిన్సులోని జియారత్ జిల్లా మంగీ డ్యాం ప్రాంతంలో పాకిస్థాన్ పారామిలటరీ దళం వాహనంలో వస్తుండగా రోడ్డు పక్కన పెట్టిన మందుపాతరను పేల్చారు. ఈ మందుపాతర పేలుడులో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు, భద్రతా బలగాలు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి  క్షతగాత్రులైన సైనికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పాక్ సైనికులు వాహనంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు, సైనికులు కలిసి ఈ డ్యాం ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ మందుపాతరను ఎవరు పేల్చారన్నది ఇంకా తేలలేదు. 


Updated Date - 2021-08-27T13:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising