ఎత్తుకెళ్లిన వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ!
ABN, First Publish Date - 2021-04-23T16:25:08+05:30
దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది.
దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. తొలుత వ్యాక్సిన్లంటే విముఖత చూపిన ప్రజలు ప్రస్తుతం వాటి కోసం ఎగబడుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలోని జింద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 1700 వ్యాక్సిన్లు చోరీకి గురి కావడం కలకలం సృష్టించింది.
ఆ వ్యాక్సిన్లను సదరు దొంగ తాజాగా తిరిగి ఇచ్చేశాడు. జింద్లోని సివిల్ పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న టీకొట్టులో ఉన్న వ్యక్తికి వ్యాక్సిన్లు ఉన్న పెట్టెను ఇచ్చేసి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఆ పెట్టెలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతోపాటు ఓ ఉత్తరం కూడా ఉంది. `క్షమించండి.. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు` అని ఆ ఉత్తరంలో రాశాడు. కరోనా చికిత్సకు ఉపయోగపడే `రెమిడెసివర్` ఇంజక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Updated Date - 2021-04-23T16:25:08+05:30 IST