బీజేపీతో మళ్లీ చేతులు కలపం: ఓం ప్రకాష్ రాజ్భర్
ABN, First Publish Date - 2021-06-14T01:35:14+05:30
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ఆశలపై ఆ పార్టీ..
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ఆశలపై ఆ పార్టీ మాజీ భాగస్వామ్య పార్టీ అయిన సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నీళ్లు చల్లింది. బీజేపీతో మళ్లీ తమ పార్టీ పొత్తు పెట్టుకునే ఆలోచన ఏదీ లేదని ఎస్బీఎస్పీ నేత ఓం ప్రకాష్ రాజ్భర్ ఆదివారంనాడు తెలిపారు. ''సమీప భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండదు. ఏ ఒక్క బీజేపీ నేతతోనూ మేము సంప్రదించలేదు. ఇప్పటివరకూ వారు కూడా మాతో సంప్రదించ లేదు'' అని రాజ్భర్ చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీసీలు, దళితులను తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చని, ఆ పార్టీ వ్యూహాల పట్ల వారంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బీసీలను కానీ , ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మార్యను కానీ ఏమాత్రం ఖాతరు చేసిందిలేదని కూడా ఆయన ఆరోపించారు.
Updated Date - 2021-06-14T01:35:14+05:30 IST