పేద, ధనిక వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు
ABN, First Publish Date - 2021-07-23T07:49:49+05:30
‘‘ధనికులకు, పేదలకు సమాంతరంగా వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు
సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 22: ‘‘ధనికులకు, పేదలకు సమాంతరంగా వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు ‘వలస’ ఆలోచన విధానాలను దూరం పెట్టాలి. సామాన్యులకు న్యాయం పట్ల, కోర్టుల పట్ల విశ్వాసం కలిగించాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురువారం మధ్యప్రదేశ్కు చెందిన ఓ బీఎస్పీ ఎమ్మెల్యే భర్త బెయిల్ను రద్దు చేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎమ్మార్ షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
రెండేళ్ల క్రితం దేవేంద్ర చౌరాసియా హత్యకేసులో సదరు ఎమ్మెల్యే భర్త అరెస్టయ్యాడు. జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. బాధితులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కిందిస్థాయి కోర్టుల పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. పలు కీలక సూచనలు చేసింది.
Updated Date - 2021-07-23T07:49:49+05:30 IST