కిలో మామిడి పండ్లు రూ. 2.7లక్షలు
ABN, First Publish Date - 2021-06-18T09:20:43+05:30
సాధారణంగా మామిడి తోటకు ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. అక్కడ మాత్రం ఏడంటే ఏడే మామి డి కాయలున్న రెండు చెట్ల వద్ద నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు.
7 మామిడి కాయలు.. నలుగురు గార్డులు.. ఆరు కుక్కలు!
మధ్యప్రదేశ్లో రెండు చెట్లకు కాసిన 7 కాయలు
జపాన్కు చెందిన అరుదైన మియాజాకి రకం
కాపలాగా నలుగురు గార్డులు.. ఆరు కుక్కలు!
భోపాల్, జూన్ 17: సాధారణంగా మామిడి తోటకు ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. అక్కడ మాత్రం ఏడంటే ఏడే మామిడి కాయలున్న రెండు చెట్ల వద్ద నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు. ఇంత భద్రత ఎందుకంటారా? ఆ రకం మామిడి పండ్లకు బంగారమంత విలువ ఉంది మరి. మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన రాణి, సంకల్ప్ దంపతుల తోటలో ఈ చెట్లున్నాయి. ఇవి జపాన్లోని మియాజాకి ప్రాంతానికి చెందిన అరుదైన రకానికి చెందిన మామిడి చెట్లు. అందుకే ఈ చెట్లకు కాసిన మామిడి పండ్లకు మియాజాకి పేరు స్థిరపడింది. ఈ పండ్లు రూబీ కలర్లో ఉంటాయి. ఒక్కో పండు బరువు 350 గ్రాములు. కిలో పండ్ల ధర ఏకంగా రూ.2.7 లక్షలు. ఓసారి రైలు ప్రయాణంలో ఈ దంపతులకు ఓ వ్యక్తి ఈ అరుదైన మొక్కలు ఇచ్చారట.
Updated Date - 2021-06-18T09:20:43+05:30 IST