బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం
ABN, First Publish Date - 2021-01-20T13:29:43+05:30
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మంగళవారం అర్దరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు....
ధూప్గురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మంగళవారం అర్దరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి జిల్లా దూప్ గురి నగరంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికి అక్కడే మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, సహాయ సిబ్బంది హుటాహుటిన దుర్ఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పొగమంచు కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
Updated Date - 2021-01-20T13:29:43+05:30 IST