Greece సముద్రంలో పడవ బోల్తా పడి 13 మంది మృతి
ABN, First Publish Date - 2021-12-25T12:38:26+05:30
గ్రీస్ దేశ సమీపంలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం అర్దరాత్రి జరిగిన పడవ ప్రమాదంలో 13 మంది....
గ్రీస్: గ్రీస్ దేశ సమీపంలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం అర్దరాత్రి జరిగిన పడవ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు.స్మగ్లర్లు టర్కీ నుంచి ఇటలీకి వెళ్లే ప్రమాదకరమైన సముద్ర మార్గంలో ఈ పడవ ప్రమాదం చోటుచేసుకుంది.శుక్రవారం అర్దరాత్రి ఏజియన్ సముద్రంలో పడవ బోల్తా పడింది.సెంట్రల్ ఏజియన్లోని పరోస్ ద్వీపానికి 8 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం అర్థరాత్రి పడవ బోల్తా పడడంతో 62 మందిని రక్షించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. ఓడలో సుమారు 80 మంది ఉన్నారని ప్రాణాలతో బయటపడిన వారు కోస్ట్ గార్డ్కు తెలిపారు.ఐదు కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ బోట్లు, తొమ్మిది ప్రైవేట్ ఓడలు, ఒక హెలికాప్టర్, మిలిటరీ రవాణా విమానం ప్రాణాలతో బయటపడినవారి కోసం రాత్రి వేళ అన్వేషణను కొనసాగించాయని అధికారులు తెలిపారు.ఈ గాలింపులో కోస్ట్ గార్డ్ డైవర్లు కూడా పాల్గొన్నారు.
Updated Date - 2021-12-25T12:38:26+05:30 IST