ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ జెండాను ఎగురవేసిన ఉగ్రవాది తండ్రి

ABN, First Publish Date - 2021-08-15T18:19:25+05:30

జమ్మూ-కశ్మీరులో 2016లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో 2016లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా టీచర్ అయిన ముజఫర్ పుల్వామా జిల్లా, ట్రాల్‌లోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వనీ భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2016 జూలైలో మరణించాడు. దీంతో కశ్మీరులో ఐదు నెలలపాటు జరిగిన ఆందోళనల్లో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. 


భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో అన్నిశాఖల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించాలని జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించారు.


Updated Date - 2021-08-15T18:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising