ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు

ABN, First Publish Date - 2021-02-27T13:17:07+05:30

ఈ ఏడాది వేసవి ఆరంభ దశలోనే ఎండలు మండుతున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): ఈ ఏడాది వేసవి ఆరంభ దశలోనే ఎండలు మండుతున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్ నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్షియస్ కు పెరిగింది. అప్పుడే ఎండలు మండిపోతుండటంతో ఒడిశాలో ఒంటిపూట పాఠశాల తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వతేదీ నుంచి 9,10 వతరగతి విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 10నుంచి12 వతరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు తరగతులు నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. భువనేశ్వర్ నగరంలో 1963 ఫిబ్రవరి 23వతేదీన అత్యధిక ఉష్ణోగ్రత 42.7 డిగ్రీలుగా నమోదైంది. 


భువనేశ్వర్ నగరంలో రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రత 18 నుంచి 39 డిగ్రీల సెల్షియస్ ఉంటుందని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.వచ్చే నాలుగైదు రోజుల్లో ఒడిశాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెప్పారు. భువనేశ్వర్ తో పాట బాలాసోర్, కటక్, సంబాల్ పూర్, సుందరఘడ్, బారిపడద ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్షియస్ కు పైగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.ఒడిశాలో ఆరంభంలోనే సూరరశ్మి ప్రతాపం చూపిస్తుండటంతో ఒడిశా సహాయ పునరావాస కమిషనర్ జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.

Updated Date - 2021-02-27T13:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising