సెప్టెంబరు ఒకటి నుంచి స్కూళ్లు తెరవనున్న తమిళనాడు సర్కారు!
ABN, First Publish Date - 2021-08-07T14:59:16+05:30
తమిళనాడు సర్కారు రాష్ట్రంలోని తొమ్మిది, పది తరగతుల...
చెన్నై: తమిళనాడు సర్కారు రాష్ట్రంలోని తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సెప్టెంబరు ఒకటి నుంచి స్కూళ్లు తెరవాలని నిర్ణయించింది. దీనితో పాటు ఆగస్టు 16 నుంచి మెడికల్ కాలేజీలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మానసిక శాస్త్రవేత్తలు కూడా స్కూళ్లను తెరవడం ఉత్తమమని సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడం వలన అది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదన్నారు.
Updated Date - 2021-08-07T14:59:16+05:30 IST