ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: అఫ్ఘాన్ మీడియాపై తాలిబన్ల నిషేధం

ABN, First Publish Date - 2021-09-07T16:09:57+05:30

అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తాజాగా మీడియాపై కూడా నిషేధం విధించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తాజాగా మీడియాపై కూడా నిషేధం విధించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చిన పంజ్‌షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్‌ఆర్‌ఎఫ్) నాయకుడు అహ్మద్ మసౌద్ సందేశాన్ని ప్రసారం చేయకుండా అఫ్ఘాన్ వార్తా మాధ్యమాలను తాలిబన్లు నిషేధించారు.అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, హై కౌన్సిల్ ఫర్ నేషనల్  మాజీ ఛైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాలు తోటి పౌరులతో కలవకుండా తాలిబన్లు అడ్డుకున్నారు.అహ్మద్ మసౌద్ సోమవారం తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చారు. ‘‘మీరు ఎక్కడ ఉన్నా మన దేశ గౌరవం, స్వేచ్ఛ, శ్రేయస్సు కోసం జాతీయ తిరుగుబాటును ప్రారంభించాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను’’ అని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అహ్మద్ మసౌద్ మీడియాకు పంపిన ఆడియో సందేశంలో కోరారు.తిరుగుబాటుపై పంజ్ షీర్, తాలిబన్ల మధ్య పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడ్డాయి.తాలిబన్లు  పంజ్ షీర్ ప్రావిన్స్‌ని విడిచిపెడితే తాను పోరాటాన్ని నిలిపివేసి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని మసౌద్ చెప్పారు.


Updated Date - 2021-09-07T16:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising