ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుద్వారాలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన తాలిబన్లు

ABN, First Publish Date - 2021-10-16T01:58:35+05:30

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిపై దారుణాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోటి జరిగింది. కాబూల్‌లోని కర్టే పర్వాన్‌లో ఉన్న గురుద్వారా దష్‌మేష్‌లో తాలిబన్లు బలవంతంగా ప్రవేశించారు.


ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి కాబూల్‌లోని సిక్కు సమాజం నుంచి తమకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. 


నేటి మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో ఆయుధాలు ధరించిన కొందరు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక యూనిట్‌కు చెందినవారమంటూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని పునీత్ సింగ్ తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని పేర్కొన్నారు.


పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుద్వారా అంతా కలియదిరిగారని, దానిని అనుకున్న ఉన్న స్కూల్‌లోకీ ప్రవేశించారని వివరించారు. వారిని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుపై చేయిచేసుకున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-16T01:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising