ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నెండో తరగతి మార్కుల విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2021-06-22T22:24:03+05:30

పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ ప్రతిపాదించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ పరీక్షలను ఈ సంవత్సరం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 


విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని తల్లిదండ్రుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ ప్రతిపాదించిన విధానం సమంజసంగా, న్యాయంగా ఉందని తెలిపింది. ఈ విధానంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యా రంగంలోని నిపుణులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారని తెలిపింది. ఎవరికీ ప్రతికూలత లేకుండా పరిపూర్ణ స్థాయిలో ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు పేర్కొంది. దీనిపై రెండో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేసింది. విశాల ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపింది. పన్నెండో తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 15-సెప్టెంబరు 15 మధ్యలో నిర్వహించేందుకు సీబీఎస్ఈ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. 


జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి వెకేషన్ బెంచ్ మంగళవారం ఈ తీర్పునిచ్చింది.


Updated Date - 2021-06-22T22:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising