ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు పరిపాలనా సంస్కరణలపై దృష్టి సారించిన CJI NV Ramana

ABN, First Publish Date - 2021-07-16T21:58:04+05:30

కోర్టు పరిపాలనా సంస్కరణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టి సారించారు. ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోర్టు పరిపాలనా సంస్కరణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టి సారించారు. ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పులు, ఉత్తర్వులు, తక్షణం అధికారులు, కోర్టులు, జైళ్లకు చేరేలా ఫాస్టర్ పేరుతో కొత్త విధానం ప్రవేశపెట్టనున్నారు. బెయిల్ మంజూరు అయినా ఖైదీల విడుదల జాప్యంపై సుమోటోగా కేసు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ సందర్భంగా సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల అమలులో జాప్యానికి ఫాస్టర్ విధానం మంగళం పాడనున్నది. తీర్పుల అమల్లో జాప్యానికి సాకులు చూపే ఆస్కారం లేకుండా ఫాస్టర్ విధానం తీసుకొచ్చారు. సురక్షితంగా, విశ్వసనీయంగా, తక్షణం ఆదేశాలు అందజేసే వ్యవస్థలా ఫాస్టర్ విధానాన్ని రూపొందించారు. 15 రోజుల్లోగా ప్రాజెక్ట్ నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీని జస్టిస్‌ ఎన్వీరమణ, ఎల్‌.నాగేశ్వరరావు, బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఫాస్టర్ అమలుకు నెల రోజుల గడువును లక్ష్యంగా ధర్మాసనం పెట్టింది. 

Updated Date - 2021-07-16T21:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising