ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన మరో పోలీసు మృతి, మృతులకు నివాళులు

ABN, First Publish Date - 2021-12-14T16:24:31+05:30

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల దాడి ఘటనలో గాయపడిన మరో పోలీసు మంగళవారం మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల దాడి ఘటనలో గాయపడిన మరో పోలీసు మంగళవారం మరణించారు.గండేర్‌బల్ జిల్లా యచామా కంగన్ ప్రాంతానికి చెందిన రమీజ్ అహ్మద్ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు.జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. శ్రీనగర్‌లోని పంథా చౌక్‌ ప్రాంతంలోని జెవాన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోదీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. పోలీసులు వెళ్తున్న బస్సుపై  ఉగ్రవాదులు జరిపిన దాడిలో అసువులు బాసిన పోలీసు షఫీఖ్ ఆలీకి జవాన్లు మంగళవారం నివాళులు అర్పించారు.


Updated Date - 2021-12-14T16:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising