ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం

ABN, First Publish Date - 2021-07-28T08:41:22+05:30

న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల నేతలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంఘం నేతలకు సీజేఐ ఎన్వీ రమణ హామీ

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల నేతలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హామీ ఇచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్‌ రావు ఢిల్లీలో జస్టిస్‌ ఎన్వీ రమణను కలిశారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తమ విజ్ఞప్తుల పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారని జాజుల శ్రీనివాస్‌ చెప్పారు. 

Updated Date - 2021-07-28T08:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising