ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపక్షాల ఐక్య శక్తి చాటుదాం... బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో రాహుల్

ABN, First Publish Date - 2021-08-03T16:38:21+05:30

విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చి బలమైన శక్తిగా నిలబడటం చాలా కీలకమని కాంగ్రెస్ పార్టీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చి బలమైన శక్తిగా నిలబడటం చాలా కీలకమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫోర్ల్ లీడర్లతో కన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో రాహుల్ మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విపక్షాలు ఐక్యశక్తిగా నిలవాలని రాహుల్ ఈ సందర్భంగా కోరారు. విపక్షాలన్నీ ఏకతాటిగా బలమైన శక్తిగా నిలిచినప్పుడే ప్రజావాణిని సమర్ధవంతంగా వినిపించగలుగుతామని అన్నారు. అలా కాని పక్షంలో బీజేపీ-ఆర్‌ఎఎస్ఎస్‌ను ఎదుర్కోవడం, ప్రజావాణిని అణిచివేయకుండా వారిని నిలువరించడం కష్టమవుతుందని అన్నారు. విపక్ష నేతలతో రాహుల్ ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీట్‌‌లో కాంగ్రెస్‌తో పాటు, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, రివల్యూషనరీ పార్టీ (ఆర్ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T16:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising