రైతుల ట్రాక్టర్ ర్యాలీని ‘ఐఎస్ఐ’ హైజాక్ చేసే ఛాన్స్ : పోలీసులు
ABN, First Publish Date - 2021-01-25T18:31:41+05:30
గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ‘ట్రాక్టర్ ర్యాలీ’ ని పాక్ ఐఎస్ఐ సంస్థతో పాటు ఖలిస్తానీ తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశాలున్నా
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ‘ట్రాక్టర్ ర్యాలీ’ ని పాక్ ఐఎస్ఐ సంస్థతో పాటు ఖలిస్తానీ తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశాలున్నాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ట్రాక్టర్ ర్యాలీ విషయంలో పెద్ద కుట్ర జరుగుతోందని, రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ర్యాలీని దెబ్బతీసేందుకు పాకిస్తాన్కు చెందిన మూడు వందలకు పైగా ట్విట్టర్ హ్యాండిల్స్ను గుర్తించామని పోలీసులు ప్రకటించారు. ఈ కుట్రను గుర్తించిన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా బందోస్తును మరింత పటిష్ఠం చేశామని, బందోబస్తుకు సంబంధించిన ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Updated Date - 2021-01-25T18:31:41+05:30 IST