అయోధ్య Durga Puja పండల్లో కాల్పులు..ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-10-14T14:06:04+05:30
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర అయోధ్య నగరంలోని దుర్గా పూజ పండల్ లో నలుగురు యువకులు కాల్పులు జరిపారు....
ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు
అయోధ్య (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర అయోధ్య నగరంలోని దుర్గా పూజ పండల్ లో నలుగురు యువకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. అయోధ్య నగరంలోని కోర్ఖానా ప్రాంతంలో బుధవారం రాత్రి దుర్గా పూజ పండల్ లోకి నలుగురు యువకులు వాహనాలతో వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన ఇద్దరు పిల్లలను అయోధ్య జిల్లా ఆసుపత్రి నుంచి లక్నో ఆసుపత్రికి తరలించారు.కాల్పులు జరిపిన ముగ్గురు యువకులు పారిపోయారు. ఈ కాల్పుల ఘటన వ్యక్తిగత శత్రుత్వానికి సంబంధించిందని,దుర్గా పూజకు సంబంధించింది కాదని అయోధ్య ఎసపీ శైలేష్ పాండే చెప్పారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, అతని ద్వారా మిగిలిన ముగ్గురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపించామని ఎస్పీ చెప్పారు.
Updated Date - 2021-10-14T14:06:04+05:30 IST