ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ముందు అన్నాడీఎంకే కూటమికి షాక్..

ABN, First Publish Date - 2021-03-07T16:39:34+05:30

జయలలిత సన్నిహితురాలు శశికళకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎడప్పాడిపై నిప్పులు చిమ్మిన కరుణాస్‌


చెన్నై : అన్నాడీఎంకే కూటమి నుంచి ముక్కుళత్తోర్‌ పులిప్పడై వైదొలగినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ హాస్యనటుడు కరుణాస్‌ ప్రకటించారు. చెన్నైలో శనివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సామాజిక న్యాయానికి గండికొట్టారని, తమ కులస్థులను మాయమాటలతో వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏ కూటమికి మద్దతు ఇవ్వదని తెలిపారు. మదురై విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగదేవర్‌ పేరు పెడతామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరిదాకా తమను వంచించి మోసగించిందని ధ్వజమెత్తారు. ముక్కుళత్తోర్‌ కులస్థులను అన్నాడీఎంకే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, వారి సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు గానీ, హామీలు కాని ప్రకటించలేదని కరుణాస్‌ అన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, దేవర్‌ కులస్థులను, తన కులమైన గౌండర్‌ కులస్థులకే అధిక ప్రాధాన్యతనిస్తూ ఇతర కులస్థులను ప్రత్యేకించి బలహీనవర్గాలకు చెందినవారికి తీరని అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని, ఆమె మద్దతుదారుడిగానే ఉంటానని తెలిపారు.

Updated Date - 2021-03-07T16:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising