ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉర్సు ఉత్సవాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘన... 500 మందిపై కేసు నమోదు!

ABN, First Publish Date - 2021-07-29T11:45:14+05:30

ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో షాహ్జీ మియా 118 ఉర్సు ఉత్సవాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలీభీత్: ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో షాహ్జీ మియా 118 ఉర్సు ఉత్సవాల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతికి మించి అధికంగా జనాన్ని ఆహ్వానించినందుకు నిర్వాహకులతో పాటు 500 మందిపై కోవిడ్-19 ప్రొటోకాల్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


వివరాల్లోకి వెళితే పట్టణం మధ్యలోనున్న షాహ్జీ మొహమ్మద్ షేర్ మియా దర్గాలో ప్రతీ యేటా ఉర్సు సందర్భంగా మేళా నిర్వహిస్తుంటారు. ఈ మేళాను చూసేందుకు దేశవిదేశాల నుంచి అన్ని మతాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. అయితే ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కారణంగా మేళాను నిర్వహించడం లేదు. అయితే ఈ ఉత్సవాలను 50 మందితో నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఈ అనుమతులకు మించి జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఉత్సవాల నిర్వాహకులతో పాటు 500 మందిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-29T11:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising