ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bengaluru: ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-08-31T15:03:15+05:30

అతి వేగంగా వస్తున్న ఆడి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ఉన్న ఏడుగురు మరణించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : అతి వేగంగా వస్తున్న ఆడి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ఉన్న ఏడుగురు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని కోరమంగళ ప్రాంతంలో వెలుగుచూసింది. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో బెంగళూరు నగరంలో ఆడి కారు వేగంగా వస్తూ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు. మరో ప్రయాణికుడు ఆసుపత్రిలో మరణించాడు. ప్రమాదానికి గురైన కారులో డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాష్ కుమారుడు కరుణసాగర్, కోడలు బిందులతోపాటు వారి బంధువులున్నారని పోలీసులు చెప్పారు. కారులో ప్రయాణం చేస్తున్న వారంతా 20 ఏళ్ల యువతీ, యువకులేనని పోలీసులు చెప్పారు. ముగ్గురు యువతులు, నలుగురు యువకులు కలిసి ఆడి కారులో అతివేగంగా వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని బెంగళూరు పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-08-31T15:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising