ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఎంపీలతో శశిథరూర్‌ సెల్ఫీ వివాదాస్పదం

ABN, First Publish Date - 2021-11-30T07:53:14+05:30

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆరుగురు మహిళా ఎంపీలతో తీసిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన థరూర్‌,.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పార్లమెంటు పనిచేసేందుకు చాలా ఆకర్షణీయమైన 

 చోటు అని ట్వీట్‌.. నెటిజన్ల మండిపాటు


న్యూఢిల్లీ, నవంబరు 29: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆరుగురు మహిళా ఎంపీలతో తీసిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన థరూర్‌, ‘లోక్‌సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు?’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది నెట్టింట వివాదాస్పదంగా మారింది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్య ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మహిళల్ని వస్తువుల్లా చూడటం ఆపండి అంటూ జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖ శర్మ థరూర్‌పై ట్విటర్‌లో మండిపడ్డారు. దీంతో.. థరూర్‌ తన పోస్టు పట్ల క్షమాపణలు చెప్పారు. కొంతమందిని బాధపెట్టినందుకు తనను క్షమించాలని కోరారు. మహిళా ఎంపీలు ప్రోత్సాహంతోనే హాస్య చతురతతో కూడిన పోస్టును పెట్టినట్లు వివరించారు.

Updated Date - 2021-11-30T07:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising