ముస్లింలు కొవిడ్ టీకాలు తీసుకునేలా Salman Khan ఒప్పించాలి
ABN, First Publish Date - 2021-11-17T16:48:38+05:30
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచించే ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కోరారు...
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచించే ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కోరారు.కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మహారాష్ట్ర ముందుందని, కాని ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీకాలు వేయించుకున్న వారి శాతం తక్కువగా ఉందని మంత్రి చెప్పారు. టీకాలు వేసుకునేలా ముస్లిమ్ సమాజాన్ని ఒప్పించేందుకు సల్మాన్ ఖాన్, ఇతర ముస్లిం పెద్దలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.స్టార్ హీరో సల్మాన్, మతపెద్దల మాటను ముస్లింలు వింటారని మంత్రి పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 10.25 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోస్లు ఇచ్చామని, అర్హులైన వారందరికీ ఈ నెలాఖరు నాటికి కనీసం మొదటి డోస్ ఇస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.ప్రజలు కొవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్ను పాటించి టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.మహారాష్ట్రలో మంగళవారం 886 కొవిడ్ -19 కేసులు, 34 కరోనా మరణాలు నమోదయ్యాయి.
Updated Date - 2021-11-17T16:48:38+05:30 IST