ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోమూత్రం తాగుతాను కాబట్టే కోవిడ్ రాలేదు: బీజేపీ ఎంపీ

ABN, First Publish Date - 2021-05-17T21:46:22+05:30

గోమూత్రం తాగడం వల్ల కోవిడ్ సోకదని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ‘‘మనం గోమూత్రం కనుక తీసుకున్నట్లైతే మన ఊపిరితిత్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: కోవిడ్ మహమ్మారికి దేశంలో అనేక మంది బలి అవుతున్నారు. వైద్య సౌకర్యాల కొరత, ఇతర కారణాలతో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతతో ప్రజను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అలాంటివారే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. కోవిడ్‌పై అవగాహన కల్పించాల్సింది పోయి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు సాధ్వి చేసిన వ్యాఖ్యు ఇందుకు నిదర్శనం.


గోమూత్రం తాగడం వల్ల కోవిడ్ సోకదని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ‘‘మనం గోమూత్రం కనుక తీసుకున్నట్లైతే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఎలాంటి జబ్బులు రావు. గోమూత్రం రోజూ తీసుకునే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను రోజు తీసుకుంటాను కాబట్టే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కరోనా కూడా రాకపోవడానికి కారణం ఇదే. మనం ప్రతి ఇంట్లో ఒక గోవును తప్పనిసరిగా పెంచుకోవాలి’’ అని అన్నారు.


అయితే వివాదస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉండే సాధ్వి.. గోమూత్రంపై గతంలో కూడా వ్యాఖ్యానించారు. 2019 ఏప్రిల్‌లో, కాన్సర్ నయం కావాలంటే గోమూత్రం తాగాలని సాధ్వి అన్నారు.

Updated Date - 2021-05-17T21:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising