ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2021-04-10T20:32:05+05:30
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్కు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో...
నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్కు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఆయనను నాగ్పూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. 70 ఏళ్ల భగవత్కు సాధారణ కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయని తెలిపింది. ‘‘ప్రస్తుతం ఆయనకు సాధారణ కరోనా లక్షణాలు కల్పిస్తున్నాయి. దీంతో ఆయనను నాగ్పూర్లోని కింగ్స్ వే ఆస్పత్రిలో చేర్పించాం. ముందస్తు జాగ్రత్తగా వైద్యులు ఆయనకు జనరల్ చెకప్ చేస్తున్నారు...’’ అని ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. కాగా శుక్రవారం భగవత్ ఆస్పత్రిలో చేరినట్టు కింగ్స్ వే యాజమాన్యం ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ... ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. కాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప ట్వీట్ చేశారు. ‘‘సర సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Updated Date - 2021-04-10T20:32:05+05:30 IST