ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలల్లో... 193 మంది మృతి

ABN, First Publish Date - 2021-04-14T18:02:52+05:30

కొవిడ్‌ వైర్‌సతో పాటు బెంగళూరు నగరంలో గత మూడు నెలలుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పెరిగిన రోడ్డు ప్రమాదాలు 


బెంగళూరు : కొవిడ్‌ వైర్‌సతో పాటు బెంగళూరు నగరంలో గత మూడు నెలలుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు నెలల వ్యవధిలో నగర పరిధిలో 941 రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 193 మంది బలయ్యారని, 830 మంది గాయపడ్డారని ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రవికాంతేగౌడ తెలిపారు. నగరంలో ఆయన ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘన వంటివి ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్నవారేనని ఆయన వెల్లడించారు. బెంగళూరు నగరంలో మొత్తం 82.53 లక్షల వాహనాలు ఉండగా అందులో 57.30 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలే ఉన్నాయన్నారు. ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనకు సంబంధించి గత 3 నెలల్లో 29.97 లక్షల కేసులను దాఖలు చేసి రూ.46.15 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-04-14T18:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising