ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ లాక్‌డౌన్‌‌కు సిద్ధమే: ఢిల్లీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-11-16T22:25:29+05:30

ఈ విషయమై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ ‘‘మేము వారాంతపు లాక్‌డౌన్‌ పెట్టాలని నిర్ణయించాం. దీనికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే కోర్టు ఇచ్చే ఆదేశాలు చాలా కీలకమైనవి, ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వారాంతపు లాక్‌డౌన్ విధించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా లాక్‌డౌన్ విధింపు ఆధారపడి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలోని పాఠశాలల కొనసాగింపుపై ఆలోచించాలని సోమవారం ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన చేసింది. అయితే భవననిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేసేందుకు మంగళవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ విషయమై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ ‘‘మేము వారాంతపు లాక్‌డౌన్‌ పెట్టాలని నిర్ణయించాం. దీనికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే కోర్టు ఇచ్చే ఆదేశాలు చాలా కీలకమైనవి, ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని అన్నారు. ఢిల్లీ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు అత్యవసర సమావేశం కాగా, కేంద్ర ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది.

Updated Date - 2021-11-16T22:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising