పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణం
ABN, First Publish Date - 2021-05-08T09:16:35+05:30
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రంగస్వామి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరి
చెన్నై, మే 7(ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రంగస్వామి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్డీఏ కూటమిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 స్థానాలు సాధించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ కూటమికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం రాజ్నివా్సలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రంగస్వామితో ప్రమాణం చేయించారు. బీజేపీతో జరుగుతున్న చర్చలపై స్పష్టత వచ్చాక త్వరలోనే రంగస్వామి మంత్రివర్గ సహచరులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2021-05-08T09:16:35+05:30 IST