ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ నేత నా గొంతు పిసికేశాడు: రాజ్యసభ మార్షల్

ABN, First Publish Date - 2021-08-13T08:48:42+05:30

బుధవారం సాయంత్రం రాజ్యసభలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ బీమా బిల్లును ఆమోదించే సమయంలో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బిల్లు చర్చ సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం రాజ్యసభలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ బీమా బిల్లును ఆమోదించే సమయంలో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బిల్లు చర్చ సమయంలో ప్రతిపక్షాలు నిరసన తెలుపడం, వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడం.. ఈ సమయంలో ఎంపీలకు, మార్షల్స్‌ మధ్య తోపులాట చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తమపై అధికార పక్షం మార్షల్స్‌తో దాడి చేయించిందని, ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రతిపక్షాలు ఆరోపించగా.. అధికార పక్షం మాత్రం ప్రతిపక్షాల మాటలను ఖండించింది.


ఈ క్రమంలోనే రాజ్యసభ మార్షల్స్‌లో ఒకరు తనపై సీపీఐ ఎంపీ దాడి చేశారని తన గొంతు నులిమేశారని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్ రాకేశ్ నేగి.. రాజ్యసభలోని పరిస్థితిపై తనపై అధికారికి వివరణ ఇస్తూ ఓ లేఖ రాశారు. అందులో.. సీపీఐ నేత, ఎంపీ ఎలమరన్ కరీమ్ తనపై దాడి చేశారని, తన గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేశారని రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్ష ఎంపీలో సభ రక్షణ వలయాన్ని విరగ్గొట్టేందుకు ప్రయత్నించాలని కూడా తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం ఈ లేఖపై సంచలనంగా మారింది.

Updated Date - 2021-08-13T08:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising