ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ భద్రతకు సెలా సొరంగం కీలకం : రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2021-10-15T00:18:22+05:30

అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సొరంగం కోసం అత్యంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సొరంగం కోసం అత్యంత ముఖ్యమైన పేలుడు గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ పర్యవేక్షణలో జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు, అరుణాచల్ సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి ఈ సొరంగం దోహదపడుతుందని చెప్పారు. 


అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో సెలా సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీనిని నిర్మిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రికార్డు స్థాయి ఎత్తులో రోడ్లు, వంతెనలు, సొరంగాలు, వైమానిక స్థావరాలను నిర్మిస్తూ దేశ ప్రగతికి కృషి చేస్తోందన్నారు. కనెక్టివిటీ మ్యాపుల్లో సుదూర ప్రాంతాలు కనిపించేలా చేస్తోందన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పటిష్టపరచడంలో బీఆర్ఓ చేస్తున్న కృషి వల్ల భారతీయ దళాల పోరాట సన్నద్ధత పెరుగుతోందని, సుదూర ప్రాంతాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందుతోందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. 


బీఆర్ఓ నిర్వహిస్తున్న 20,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ యాత్రను రాజ్‌నాథ్ గురువారం ప్రారంభించారు. 


Updated Date - 2021-10-15T00:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising