IMD warning: దేశంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలు
ABN, First Publish Date - 2021-07-19T15:15:03+05:30
దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ)...
న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కొంకణ్, బీహార్ ప్రాంతాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు.భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు ప్రవహించే అవకాశముంది.
Updated Date - 2021-07-19T15:15:03+05:30 IST