ఢిల్లీలో భారీ వర్షం... రోడ్లపై నిలిచిన నీరు... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్!
ABN, First Publish Date - 2021-08-31T17:09:59+05:30
దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వేడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగినట్లు అనిపించినా, వర్షాల కారణంగా పలు అవస్థలకు లోనవుతున్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాలలోని రోడ్లు జలమయంగా మారాయి. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ముంబైలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి.
Updated Date - 2021-08-31T17:09:59+05:30 IST