Rahul gandhi : ప్రజల ’మన్ కీ బాత్’ అర్థం చేసుకోండి...
ABN, First Publish Date - 2021-07-25T20:15:48+05:30
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘‘మీరు దేశ ప్రజల మన్ కీ బాత్ను అర్థం చేసుకుంటే...
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘‘మీరు దేశ ప్రజల మన్ కీ బాత్ను అర్థం చేసుకుంటే... దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా ఉండేదే కాదు’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘మన్ కీ బాత్’ లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ప్రజలందరూ వ్యాక్సిన్ను వేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భయాన్ని దరిచేయనీయకూడదని భరోసా నింపేందుకు ప్రయత్నించారు. కోవిడ్ ఇంకా సమసిపోలేదని, వివిధ పండగల దృష్ట్యా, అందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-07-25T20:15:48+05:30 IST