rahul gandhi : రెండు రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో పర్యటన
ABN, First Publish Date - 2021-08-05T00:17:52+05:30
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో
శ్రీనగర్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే ప్రథమం. గతంలోనే రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. జమ్మూ కశ్మీర్లో త్వరలోనే పర్యటిస్తానని వారికి రాహుల్ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం రాహుల్ రెండు రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో బస చేయనున్నారు.
Updated Date - 2021-08-05T00:17:52+05:30 IST