రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ABN, First Publish Date - 2021-10-13T18:07:44+05:30
లఖింపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది.
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. బృందంలో రాహుల్ గాంధీతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాంనబీ అజాద్, అజయ్ రంజన్ చౌదరీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని రాహుల్ కోరారు. అలాగే లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-10-13T18:07:44+05:30 IST