కొవిడ్ వారియర్లుగా గుర్తించాలి: ప్రెస్ కౌన్సిల్
ABN, First Publish Date - 2021-05-07T08:03:22+05:30
జర్నలిస్టులను కొవిడ్ వారియర్లుగా గుర్తించాలని కేంద్రం, రాష్ట్రాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) మరోసారి కోరింది. ప్రస్తుతం కొవిడ్ వారియర్లుగా గుర్తించిన వారికి...
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులను కొవిడ్ వారియర్లుగా గుర్తించాలని కేంద్రం, రాష్ట్రాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) మరోసారి కోరింది. ప్రస్తుతం కొవిడ్ వారియర్లుగా గుర్తించిన వారికి అందుతోన్న అన్ని ప్రయోజనాలను జర్నలిస్టులకూ అం దించాలని కోరింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వారికి ప్రభుత్వ బీమా సౌకర్యం కూడా కల్పించాలని పే ర్కొంది. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని చెప్పింది. జర్నలిస్టులను కొవిడ్ వారియర్ల జాబితాలో చేర్చిన ఒడిసా, బిహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను అభినందిస్తున్నట్లు పీసీఐ తెలిపింది.
Updated Date - 2021-05-07T08:03:22+05:30 IST