వార్షిక పరీక్షలు వాయిదా వేయండి
ABN, First Publish Date - 2021-04-09T06:26:16+05:30
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన వార్షిక పరీక్షలను వాయిదా వేయాలని 10వ, 12వ తరగతి విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు
ప్రభుత్వానికి 10, 12 తరగతుల విద్యార్థుల విన్నపం
కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం: అధికారులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన వార్షిక పరీక్షలను వాయిదా వేయాలని 10వ, 12వ తరగతి విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఆన్లైన్లోనైనా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు హ్యాష్ట్యాగ్ ‘‘కేన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021’’ పేరిట పిటిషన్పై లక్షమంది విద్యార్థులు సంతకాలు చేశారు. దివ్యా గార్గ్ అనే పదో తరగతి విద్యార్థిని ‘చేంజ్ డాట్ ఆర్గ్’పై పోస్ట్ చేసిన ఈ పిటిషన్ గత రెండు రోజులుగా ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే తరగతులను ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున.. పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. అయితే కొవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని సీబీఎ్సఈ, సీఐఎ్ససీఈ అధికారులు అంటున్నారు.
Updated Date - 2021-04-09T06:26:16+05:30 IST