ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

uttarpradesh: హిజ్రా ఇంట్లో చోరీ: ఫేస్‌బుక్ సాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు!

ABN, First Publish Date - 2021-07-13T14:32:57+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ పోలీసులు ఫేస్ బుక్ సాయంతో ఇద్దరు దొంగలను పట్టుకుని జైలుకు తరలించారు. పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగపతి గ్రామానికి చెందిన హిజ్రా ఇంటిలో ఆరు లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫేస్‌బుక్ సాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులు గడచిన 9 రోజులుగా తమ లొకేషన్ మారుస్తూ వచ్చారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లలో తిరుగుతూ వచ్చారు.  అయితే వీరిపై దృష్ట సారించిన పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ హిజ్రా రజనీ గుప్తా ఇంటిలో చోరీ జరిగిందన్నారు. విలువైన బంగారు, వెండి నగలు మాయమయ్యాయన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన ఇంటిలో మరో ఇద్దరు హిజ్రాలు గత కొన్ని నెలలుగా ఉన్నారని, వారిపైననే తనకు అనుమానం ఉన్నదని పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ సమయంలో నిందితులు నగలకు సంబంధించిన ఒక ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితుల లొకేషన్ గుర్తించి, వారిని పట్టుకున్నారు. 

Updated Date - 2021-07-13T14:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising