ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలపండి : మోదీ

ABN, First Publish Date - 2021-06-04T01:31:08+05:30

పాఠశాలల్లో, కాలేజీల్లో ‘టీం స్పిరిట్’ గురించి బోధించేవారని, కరోనా సమయంలో దీనిని స్పష్టంగా చూశామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాఠశాలల్లో, కాలేజీల్లో ‘టీం స్పిరిట్’ గురించి బోధించేవారని, కరోనా సమయంలో దీనిని స్పష్టంగా చూశామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొంటామని అందరూ ధీమాగా ఉన్నారని తెలిపారు. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌కు ప్రధాని మోదీ హఠాత్తుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆయన షెడ్యూల్‌లో లేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... విద్యార్థులందరూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారన్న నమ్మకంతో ఉన్నానని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచించాలని, జూన్ 1 వ తేదీ వరకూ పరీక్షల గురించి ఆలోచించేవారని మోదీ అన్నారు. దీనికి ఓ విద్యార్థి సమాధానమిస్తూ... ‘‘సార్... మీరు పరీక్షలను ఓ పండగలా భావించాలని గతంలో చెప్పారు. అందుకే మాకు పరీక్షలంటే భయమే లేదు’’ అని బదులిచ్చింది. మరోవైపు సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-06-04T01:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising