ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరయు కెనాల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2021-12-11T20:51:02+05:30

ఘాంఘ్ర, సరయు, రప్తి, బాన్‌గంగ, రోహిని నదులను అనుసంధానిస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలరాంపూర్: ఘాఘ్ర, సరయు, రప్తి, బాన్‌గంగ, రోహిణి నదులను అనుసంధానిస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, బలరాంపూర్‌ నుంచే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిన తన పార్లమెంటరీ జర్నీ ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.


బలరాంపూర్ ప్రిన్స్‌లీ స్టేట్‌ మహారాజా పటేశ్వరి ప్రసాద్ సింగ్ సాహెబ్‌‌‌ పేరును ప్రస్తావిస్తూ, అయోధ్యలో రామాలయం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, మహారాజా పటేశ్వర్ సింగ్ సాహెబ్‌ పేరు ప్రస్తావించకుండా ఉండలేమని అన్నారు. బలరాంపూర్ ప్రజలకు కళల పట్ల ఎంతో మమకారమని, నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో ఇద్దరు భారతరత్నలను అందించారని ప్రశంసించారు. బలరాంపూర్‌తో వాజ్‌పేయికి విడదీయరాదని అనుబంధం ఉందని, వాజ్‌పేయి తొలినాళ్లలో ఆయనను చూసిన వారు ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అన్నారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి జన్‌సంఘ్ అభ్యర్థిగా మూడు సీట్లలో పోటీ చేశారు. బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1962లో బలరాంపూర్, లక్నోల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 1967లో బలరాంపూర్ నుంచి మరోసారి పోటీచేసి గెలుపొందారు.


కాగా, పీఎంఓ అధికార ప్రకటన ప్రకారం, సరయు కెనాల్ ప్రాజెక్టును 1978లోనే ప్రారంభించారు. అయితే నిలకడైన బడ్జెటరీ సపోర్ట్, సంబంధిత శాఖల మధ్య సమన్వయలోపం, సరైన నిఘా లోపం కారణంగా నాలుగు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. 2016లో ఈ ప్రాజెక్టును ప్రధాన్ మంతరి క్రిషి సించాయీ యోజన కింద చేర్తి నిర్దిష్ట కాలపరమితిలో పూర్తి చేశారు. మొత్తం రూ.9,800 కోట్ల వ్యయంలో రూ.4,600 కోట్లు గత నాలుగేళ్లలోనే కేటాయించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్ల భూములకు సాగు నీరు అందుతుంది. 6,200 గ్రామాల్లోని 29 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలు-బహ్‌రిచ్, స్రవస్తి, బలరాంపూర్, గోండ, సిద్ధార్ధ్‌నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్‌లకు ప్రయోజనం చేకూరుతుంది.

Updated Date - 2021-12-11T20:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising