ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే రైతుల ఖాతాలకు పీఎం-కిసాన్ స్కీమ్ సొమ్ము

ABN, First Publish Date - 2021-08-08T17:05:50+05:30

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) స్కీమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) స్కీమ్ 9వ విడత సొమ్మును రైతుల ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేస్తారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. 


పీఎంఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పీఎం-కిసాన్ నిధి తొమ్మిదో విడత సొమ్మును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక్కొక్క రైతుకు రూ.2,000 చొప్పున అందజేస్తారు. మొత్తం మీద 9.75 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19,500 కోట్లు విడుదల చేస్తారు. మోదీ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారు.


ఈ పథకం క్రింద ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ సొమ్మును మూడు సమాన వాయిదాల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఇప్పటి వరకు రైతులకు రూ.1.38 లక్షల కోట్లు అందజేసింది. 



Updated Date - 2021-08-08T17:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising