ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోధ్‌పూర్‌లో 97మంది Pakistani వలసదారులకు భారత పౌరసత్వం

ABN, First Publish Date - 2021-11-12T16:58:40+05:30

పాక్ నుంచి వలస వచ్చిన వారికి భారత్ పౌరసత్వం ఇచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోధ్‌పూర్(రాజస్థాన్): పాక్ నుంచి వలస వచ్చిన వారికి భారత్ పౌరసత్వం ఇచ్చింది. తొంభై ఏడు మంది పాకిస్థాన్ మైనారిటీ వలసదారులకు గురువారం జోధ్‌పూర్ నగరంలో భారత పౌరసత్వం లభించింది. వారందరికీ జిల్లా సమాచార కేంద్రంలో జరిగిన శిబిరంలో జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించింది.తమ వద్ద మరో 35 సర్టిఫికేట్లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని రాబోయే రెండు-మూడు రోజుల్లో జారీ చేస్తామని అధికారులు చెప్పారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పౌరసత్వం సమస్య  ఎట్టకేలకు పరిష్కారమైంది.


చాలా కాలంగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ఈ వలసదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాల జారీ ఉపశమనం కలిగించింది. పౌరసత్వ సర్టిఫికేట్‌ల కోసం అర్హత ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మేజిస్ట్రేట్‌లకు పౌరసత్వ అధికారాలు అప్పగించినప్పటికీ గత నాలుగేళ్లలో 75 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అర్హులైన వలసదారులందరికీ పౌరసత్వం లభించే వరకు శిబిరాలు ఏర్పాటు చేయాలని వలసదారులు కోరుతున్నారు. 



Updated Date - 2021-11-12T16:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising