ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దాడి మా పనే: పాకిస్థాన్ తాలిబన్

ABN, First Publish Date - 2021-04-22T23:09:34+05:30

పాకిస్థాన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌ వద్ద నేడు జరిగిన బాంబు పేలుడు తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌ వద్ద నేడు జరిగిన బాంబు పేలుడు తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్ ప్రకటించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఉన్న విలాసవంతమైన సెరేనా హోటల్‌లో పాకిస్థాన్‌కు చైనా రాయబారి బస చేశారు. ఈ హోటల్ కార్ పార్కింగ్‌ ప్రాంతంలో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.  


ఈ ఘటనను చైనా తీవ్రంగా ఖండించింది. మరోవైపు, ఈ పేలుడు తమ పనేనని, తమ లక్ష్యం భద్రతాధికారులని పాకిస్థాన్ తాలిబన్ తాజాగా ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్ ముందుగా నిర్దేశించుకున్నట్టుగానే నేరుగా భద్రతాధికారులను ఢీకొట్టాడని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అధికార ప్రతినిధి తెలిపాడు. కాగా, చనిపోయిన వారిలో భద్రతాధికారులు, హోటల్ సిబ్బంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో ఆ హోటల్‌లో తమ రాయబారి లేరని చైనా విదేశీ మంత్రిత్వశాక అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.  

Updated Date - 2021-04-22T23:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising