ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asaduddin owaisi : నా పరువు పోగొట్టుకోను....

ABN, First Publish Date - 2021-09-08T01:12:17+05:30

సమాజ్‌వాదీతో పొత్తు విషయమై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సమాజ్‌వాదీతో పొత్తు విషయమై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానంతో చెలగాటాలు ఆడలేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘ఈ ప్రశ్నకు సమాధానం అఖిలేశ్‌ను అడగండి. అందరూ నన్నుఅడుగుతున్నారు. ఆత్మాభిమానంతో నేను చెలగాటాలు ఆడలేను. పొత్తు విషయంలోనే చర్చలంటూ జరిగితే పక్కాగా, ఇరు పక్షాల నుంచీ జరగాల్సిన అవసరం ఉంది.’’ అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీలో ఉన్న ముస్లింలు అత్యంత ఇబ్బందుల్లో ఉన్నారని, అధికారంలో ప్రతి ఒక్కరూ వాటాను పొందినప్పుడే పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు ముస్లింలు అసలు శక్తి ఏమిటన్నది చూపించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-09-08T01:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising