జిన్నా వ్యాఖ్యలపై అఖిలేష్కు మద్దతు ఇచ్చిన రాజ్భర్
ABN, First Publish Date - 2021-11-12T00:57:40+05:30
గురువారం ఆయన లఖ్నవూలోని ఎస్బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘‘కులగణన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. పేదరికం, సామాజిక న్యాయం, నిరుద్యోగం, దీనికి ఏర్పడాల్సిన కమిటీ, రిపోర్ట్లు వంటి వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు..
లఖ్నవూ: పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ వ్యాఖ్యానించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ మద్దతు ఇచ్చారు. అఖిలేష్ అన్నదాంట్లో తప్పేమీ లేదని, జిన్నా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని ఆయన స్పష్టం చేశారు. అఖిలేష్ వ్యాఖ్యలను అడ్డుపెట్టి కులగణన జరగకుండా అడ్డుపడేందుకు కుట్ర జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన లఖ్నవూలోని ఎస్బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘‘కులగణన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. పేదరికం, సామాజిక న్యాయం, నిరుద్యోగం, దీనికి ఏర్పడాల్సిన కమిటీ, రిపోర్ట్లు వంటి వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ జిన్నా గురించే మాట్లాడుతున్నారు. కులగణనను పక్కదారి పట్టించేందుకే కదా అందరి ప్రయత్నం. అవును.. అఖిలేష్ అన్నదాంట్లో తప్పేంటి? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మందిలో జిన్నా ఒకరు. అఖిలేష్ అన్నదాంట్లో తప్పేంటి?’’ అని అన్నారు.
Updated Date - 2021-11-12T00:57:40+05:30 IST