ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra:బోయిసర్‌ ఫ్యాక్టరీలో పేలుడు..ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-09-04T17:06:35+05:30

మహారాష్ట్రలోని బోయిసర్ నగరం పారిశ్రామిక వాడలోని వస్త్ర పరిశ్రమలో శనివారం సంభవించిన పేలుడులో ఒకరు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురికి గాయాలు

బోయిసర్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని బోయిసర్ నగరం పారిశ్రామిక వాడలోని వస్త్ర పరిశ్రమలో శనివారం సంభవించిన పేలుడులో ఒకరు మరణించారు. బోయిసర్ లోని జఖారియా ఫ్యాబ్రిక్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఫ్యాక్టరీలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించామని పాల్ఘార్ పోలీసులు చెప్పారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు.ఫ్యాక్టరీలో పేలుడుకు కారణాలు తెలియలేదు.

Updated Date - 2021-09-04T17:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising